దిశ కథనానికి స్పందన

వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని దిశ దినపత్రికలో వచ్చిన *బెట్టింగ్ జోర్* కథనానికి రేవల్లి ఎస్ఐ తిరుపతి రెడ్డి స్పందించారు.

Update: 2024-03-27 16:58 GMT

దిశ, రేవల్లి: వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలోని దిశ దినపత్రికలో వచ్చిన *బెట్టింగ్ జోర్* కథనానికి రేవల్లి ఎస్ఐ తిరుపతి రెడ్డి స్పందించారు. గ్రామాల్లో క్రికెట్ ఆడుతున్న యువకులతో మాట్లాడుతూ… ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ప్రలోభాలకు లోబడి జోరుగా బెట్టింగుకు బానిస అవ్వద్దు అని, యూపీఐ ద్వారా సులభంగా మనీ ట్రాన్స్ఫర్ చేసుకుని డబ్బులు పోగొట్టుకొని తిప్పలు పడవద్దని, అనవసరంగా ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని గ్రామాల్లో క్రికెట్ ఆడుతున్న యువతకు సలహాలు ఇవ్వడం జరిగింది. అదే విధంగా సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడల వల్ల జరిగే ప్రయోజనాలు అలాగే, ఆరోగ్యంగా చురుగ్గా ఉండటం ఇలాంటి వివరించడం జరిగింది.

Similar News