KCR మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం : ప్రభుత్వ విప్ బాలరాజు

రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు.

Update: 2022-11-29 12:02 GMT

దిశ, లింగాల : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా ఎదిగిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం కొత్తకుంటపల్లి గ్రామానికి చెందిన కుర్మయ్యకు దళితబంధు పథకం ద్వారా టెంట్ హౌస్ మంజూరు కాగా, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం మండల పరిధిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళితబంధు పథకం దళితుల పాలిట వరంగా మారిందన్నారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రజాప్రతినిధులు విభేదాలను పక్కనపెట్టి ఐకమత్యంతో ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మాకం తిరుపతయ్య, జిల్లా నాయకులు కేటి తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హనుమంత్ రెడ్డి, లింగాల సర్పంచ్ కోనేటి తిరుపతయ్య, వివిధ గ్రామాల సర్పంచ్ లు ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News