చల్లా గెలుపు అనివార్యం : హర్షవర్ధన్ రెడ్డి

మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు అనివార్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు.

Update: 2024-04-26 14:59 GMT

 దిశ, ప్రతినిధి,మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి గెలుపు అనివార్యమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థులతో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గతంలో ఎంతో మంది ఈ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచి వాళ్ళ హోదాను, ఆస్తులను పెంచుకోవడానికి, వారి కుటుంబ, బంధువర్గ సభ్యులకు పనులు, కాంట్రాక్టులకై పనిచేశారే తప్ప, విద్య, ఉద్యోగం, ఉపాధి,సంక్షేమం, అభివృద్ధి, నిరుద్యోగ సమస్య లాంటి వాటిపై దృష్టి పెట్టిన పాపాన పోలేదని విమర్శించారు.

సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు,పాలమూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి విద్యాధికుడు, సమస్యలు పట్ల అవగాహన కలిగి, పరిష్కార దిశగా ఆలోచించే వ్యక్తిగా ఆయన సమర్థుడని, ఎంపీగా గెలిపిస్తే కేంద్రం నుంచి జిల్లాకు ఎన్నో పరిశ్రమలు తీసుకురాగల సత్తా ఉన్న నాయకుడని ఆయన అన్నారు. ఎంపీగా గెలిపించుకునే అవసరం మనందరికీ ఎంతో ఉందని, చల్లా వంశీచంద్ రెడ్డి ని భారీ మెజార్టీతో గెలిపించాలని హర్షవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Similar News