ఓపెన్ కరాటే పోటీల్లో భాష్యం విద్యార్థుల ప్రతిభ

సెకెండ్ సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో భాష్యం గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు.

Update: 2022-12-04 12:54 GMT

దిశ, మద్దూరు: సెకెండ్ సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ లో భాష్యం గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఆదివారం శ్రీనివాస కల్యాణ మండపంలో 2వ జాతీయ స్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో నారాయణపేట జిల్లా మద్దూరు మండలం భాష్యం గ్రామర్ స్కూల్ కు చెందిన విద్యార్థులు పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచారు. అండర్ 10 విభాగంలో వంశీ తేజ కాంస్యం పతకం, గర్ల్స్ అండర్ 11 విభాగంలో శ్రీనిధి బంగారు పతకం, బి.శ్రుతి కాంస్య పతకం సాధించగా.. అండర్ 12 విభాగంలో అర్చన వెండి పతకం సాధించినట్లు కరాటే మాస్టర్ మొహమ్మద్ సలీం తెలిపారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన వైజాగ్ భారత్ షోటోకన్ కరాటే అసోసియేషన్ చీఫ్ నరేంద్ర విజేతలకు బహుమతులు అందజేశారు.



 


Tags:    

Similar News