‘ఈటల’కు లింగాయత్‌ల మద్దతు

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వీరశైవ లింగాయత్‌లు మద్దతు ప్రకటించారు.

Update: 2024-05-11 08:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వీరశైవ లింగాయత్‌లు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షుడు ఆలూరే ఈశ్వర ప్రసాద్ తాజాగా లింగాయత్‌లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

మల్కాజిగిరిలో సుమారు మూడు వేల కుటుంబాలు ఉంటాయన్నారు. ఈ మూడు వేల కుటుంబాలు సైతం బీజేపీకి పూర్తి మద్దతుగా తెలుపుతామని చెప్పారు. అనుభవజ్ఞులు, సమస్యలు పరిష్కరించడంలో అనుభవం కలిగిన ఈటల రాజేందర్‌కు తమ సమాజం పూర్తి మద్దతు ప్రకటిస్తుందని వెల్లడించారు. ప్రధాని మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కాబోతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రధానిగా మోడీ సర్కార్ ఉంటేనే దేశం అభివృద్ధి సాధ్యమని తెలిపారు.

Tags:    

Similar News