వన్ టౌన్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాజు
ఖమ్మం వన్ టౌన్ ఎస్ఐగా వై.రాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం వన్ టౌన్ ఎస్ఐగా వై.రాజు సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో కొనిజర్ల ఎస్సైగా విధులు నిర్వహించిన ఆయన పోలీసు కమిషనర్ విష్ణు వారియర్ ఆదేశాలతో రాజు ఖమ్మం వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన సీఐ చిట్టిబాబును మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ క్రిమినల్ చర్యలకు చెక్ పెట్టేలా సీఐ ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తానని తెలిపారు.