కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయం

కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వినోద్​రావు అన్నారు.

Update: 2024-05-07 11:30 GMT

దిశ, వైరా : కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టడం ఖాయమని ఆ పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి వినోద్​రావు అన్నారు. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి వినోద్​రావు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం బైక్ ర్యాలీతో రోడ్ షో నిర్వహించారు. వైరా శాస్తానగర్ లోని సాయిబాబా ఆలయంలో మాజీ మంత్రి కమల్ మంజు జియో కాకతీయ తో కలిసి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రోడ్ షో ప్రారంభం సందర్భంగా వినోద్ రావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి డప్పు కొట్టి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా పొంగులేటి సుధాకర్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వినోద్​రావు మాట్లాడుతూ కేంద్రంలో రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోడీ మూడోసారి అధికారం చేపట్టడం ఖాయమన్నారు.

    దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకే దక్కుతుందన్నారు. దేశంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించారని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికలలో బీజేపీ 400 సీట్లు గెలువడం ఖాయమన్నారు. ఖమ్మం ఎంపీ అభ్యర్థి వినోద్​ రావు సునాయాసంగా గెలుస్తారని పొంగులేటి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి బీజేపీ ప్రభుత్వాన్ని గాడిద గుడ్డు పేరుతో చలోక్తులు విసురుతున్నారని, అది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, నాయకులు శ్రీధర్ రెడ్డి, శ్యామ్ రాథోడ్, నెల్లూరు కోటేశ్వరరావు, రంగా కిరణ్, ఏలే భద్రయ్య, వెంకటకృష్ణ ,మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Similar News