గంజాయి పట్టివేత

పాల్వంచ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.30 వేల విలువ గల గంజాయిని పోలీసులు శుక్రవారం తడికలపూడి క్రాస్ రోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు.

Update: 2023-02-03 12:02 GMT

దిశ, టేకులపల్లి: పాల్వంచ నుంచి అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.30 వేల విలువ గల గంజాయిని పోలీసులు శుక్రవారం తడికలపూడి క్రాస్ రోడ్ వద్ద స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా పాల్వంచకు చెందిన అన్వర్, తడకలపూడికి చెందిన బానోత్ ప్రభాస్, మరో మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్ కు తరలించనున్నట్లు సీఐ ఆలేటి ఇంద్రసేనారెడ్డి, ఎస్సై భుక్యా శ్రీనివాస్ తెలిపారు.

Similar News