నేను పక్కా లోకల్ : బీజేపీ అభ్యర్థి

నేను పక్కా లోకల్ నాకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద రావును అన్నారు.

Update: 2024-04-29 12:48 GMT

దిశ, ప్రతినిధి,కొత్తగూడెం: నేను పక్కా లోకల్ నాకు ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని బిజెపి పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద రావును అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ జనసభ కార్యక్రమంలో వినోద రావు మాట్లాడుతూ..జిల్లాలో ముగ్గురు కాంగ్రెస్ మంత్రులు ఉన్నా అభివృద్ధి మాత్రం కనుచూపు మేర కనబడటం లేదని అన్నారు.

సిద్ధాంతాలు లేని పార్టీలో వియ్యంకుల కోసం పనిచేస్తున్నారని, ప్రజా శ్రేయస్సు మరచి స్వలాభం కోసం పాకులాడే వారిని ప్రజలు నమ్మబోరని అన్నారు. జిల్లాలో పుట్టి పెరిగిన తాను స్థానికుడినని, కమలం పువ్వుకు ఓటు వేసి గెలిపిస్తే నరేంద్ర మోడీకి ఓటేసి గెలిపించి నట్లేనని అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్న అభివృద్ధి కాంక్షించే నాయకులు కరువయ్యారని అన్నారు. జరగబోయే ఎన్నికల్లో తమకు ఓటు వేసి గెలిపిస్తే రుణం తీర్చుకుంటారని సభా ముఖంగా తెలియజేశారు. జరగబోయే ఎన్నికల్లో ప్రజలు కమలం పువ్వుకు ఓటు వేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

Similar News