మానవాళి కోసం శిలువ మోసిన ఏసు
మానవాళి కోసం ఏసుప్రభు శిలువ మోశారని పలువురు క్రైస్తవ మత గురువులు పేర్కొన్నారు.
దిశ, నెట్వర్క్ : మానవాళి కోసం ఏసుప్రభు శిలువ మోశారని పలువురు క్రైస్తవ మత గురువులు పేర్కొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శుక్రవారం గుడ్ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల శిలువ మోసి ప్రభువు సూచించిన మార్గాలకు ప్రజలకు వివరించారు. చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలు చోట్ల ఉపవాస దీక్షలను విరమించారు.