తల్లి అంత్యక్రియలను ఆన్‌లైన్‌లో వీక్షించిన కొడుకులు

దిశ, మల్యాల: అమెరికాలో మృతి చెందిన తల్లి అంత్యక్రియలు చేసే

Update: 2022-03-13 15:46 GMT

దిశ, మల్యాల: అమెరికాలో మృతి చెందిన తల్లి అంత్యక్రియలు చేసే భాగ్యం ఆమె కొడుకులకు దక్కలేదు. అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి మృతి చెందగా.. పాసుపోర్టు పోయిన కారణంగా మృతదేహన్ని స్వదేశానికి తీసుకురావడం వీలు కాకపోవడంతో అక్కడే అంత్యక్రియలు జరిపారు. కన్న కొడుకులు ఆన్‌లైన్ లైవ్ లో వీక్షించిన విషాద ఘటన మల్యాలలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మల్యాల మండల కేంద్రానికి చెందిన కందుకూరి విజయ వృత్తి రీత్యా ఆర్టీసీ కండక్టర్. కోరుట్ల డిపోలో విధులు నిర్వహిస్తున్న విజయ ఇటీవలే లాంగ్ లీవ్ పెట్టి అమెరికాలో ఉన్న భర్త దగ్గరికి అమెరికా చూడటానికి వెళ్ళింది. అమెరికాలోని అలాస్కా రాష్ట్రం కార్డోవలో ఈ నెల 10న విజయ రోడ్డు దాటుతుండగా.. ప్రమాదానికి గురై మృతి చెందింది. ఆమె పాస్‌పోర్టు చోరీ కావడంతో మృతదేహం ఇండియా తీసుకురావడానికి వీలు కాలేదు. దీంతో చేసేదేమి లేక భర్త అశోక్ శనివారం అక్కడే విజయ అంత్యక్రియలు చేశారు.అంత్యక్రియలు అమెరికాలో జరుపగా మల్యాలలో ఉన్న విజయ ఇద్దరు కొడుకులు, మిగతా కుటుంబసభ్యులు లైవ్ లో చూసి అంత్యక్రియలకు కూడా నోచుకోలేక పోయామని రోధించిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Tags:    

Similar News