బండికి మద్దతుగా మోడీ మాస్క్..

శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ శ్రేణులు ఇంటింటా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి.

Update: 2024-04-29 07:29 GMT

దిశ, శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని వివిధ గ్రామాల్లో బీజేపీ శ్రేణులు ఇంటింటా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నాయి. కొత్తగట్టు గ్రామంలో సోమవారం నిర్వహించిన ప్రచారంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యుడిగా బండి సంజయ్‌ని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు భారతీయ జనతా పార్టీచేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ జోరుగా ప్రచారాన్ని నిర్వహించారు. బండి సంజయ్ చేసిన అభివృద్ధి, స్వచ్ఛంద కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. ఈ సందర్భంగా మోడీ మాస్క్‌లను ధరించి ప్రచారం నిర్వహించడం అందరినీ ఆకట్టుకుంది. మోడీనే వచ్చి ప్రచారం చేస్తున్నారా అన్న రీతిలో బండి సంజయ్‌కు మద్దతుగా చేపట్టిన ప్రచారం గ్రామస్తులను ఆకర్శించింది.

ఈ కార్యక్రమంలో శక్తికేంద్ర ఇంఛార్జి సుధగోని శ్రీనివాస్ గౌడ్, జిల్లా కిసాన్ మోర్చ కార్య వర్గ సభ్యులు ఇంద్రాసేన రెడ్డి, సాగిరామ్ భద్రరావు, BJYM మండల ఉపాధ్యక్షుడు నూనె కొండల్ రెడ్డి, ఓబీసీ మోర్చా మండల ఉపాధ్యక్షుడు మడ్డి సంతోష్, నల్ల భాస్కర్ రెడ్డి, మాజీ వార్డ్ సభ్యులు గొల్లపల్లి శ్రీనివాసచారి, నల్ల రాజీ రెడ్డి, బోడ అనిల్, మోరె సమ్మయ్య, అంబాల సురేశ్, ఎల్కపల్లి భిక్షపతి, మల్కనూరు సాయి, మునిగంటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Similar News