ప్రైవేట్ ఉపాధ్యాయురాలి మృతి

దిశ, మంథని: స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా మరణించిన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది..

Update: 2022-09-24 15:16 GMT

దిశ, మంథని: స్థానిక ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయురాలు ఆకస్మికంగా మరణించిన సంఘటన మంథనిలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మున్సిపల్ పరిధి పవర్ హౌస్ కాలనీకి చెందిన పెంటరి మానస (22) అనే యువతి కృష్ణవేణి పాఠశాలలో పని చేస్తుంది. శనివారం పాఠశాలలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సాయంత్రం ఇంటికి వచ్చిన మానస లోబీపీతో ఇంట్లో కిందపడిపోయింది. అనంతరం కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులను మున్సిపల్ ఛైర్‌పర్సన్ పుట్ట శైలజ పరామర్శించారు. అప్పటి వరకు తమతో ఆడి పాడిన టీచర్ అకస్మాత్తుగా మృతి చెందిన సంఘటన స్థానికంగా విషాదం నింపింది.

Similar News