పెద్దపల్లిలో14 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తిరస్కరణ...

లోక్ సభ ఎన్నికల్లో 02-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ స్థానంలో 14

Update: 2024-04-26 15:33 GMT

దిశ,పెద్దపల్లి ప్రతినిధి : లోక్ సభ ఎన్నికల్లో 02-పెద్దపల్లి (ఎస్.సి.) పార్లమెంట్ స్థానంలో 14 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించారు. నాల్గవ విడతలో పోలింగ్ జరుగనున్న పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు 63 మంది అభ్యర్థులు 109 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని రిటర్నింగ్ అధికారి తెలిపారు. ఏప్రిల్ 26న శుక్రవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి నమోదైన నామినేషన్ పత్రాలను పరిశీలించి, భారత ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నిబంధనల ప్రకారం అన్ని వివరాలు పూర్తిగా సమర్పించిన 49 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను ఆమోదించామని, వివరాలు అసంపూర్తిగా ఉండి, ఈసీ నిబంధనలు పాటించని కారణంగా 14 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించినట్లు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.

Similar News