డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యత వహించకుండా నిర్మాణం చేపట్టాలని...Additional Collector visits Double bedrooms
దిశ, రామడుగు: డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణంలో జాప్యత వహించకుండా నిర్మాణం చేపట్టాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అన్నారు. శుక్రవారం మండలంలోని గోపాల్ రావుపేట గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాన్ని పరిశీలించారు. తుది దశలో ఉన్న నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరు చేయాలని సంబంధిత డీఈ, ఈఈని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రాజకుమార్, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.