కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు జీరో.. నగరంలో వెలిసిన ఫ్లెక్సీలు!
కేంద్ర ప్రభుత్వం ప్రవెశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదు అంటూ హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి.
దిశ, జూబ్లిహిల్స్: కేంద్ర ప్రభుత్వం ప్రవెశ పెట్టిన బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా రాలేదు అంటూ హైదరాబాద్ నగరంలో ఫ్లెక్సీలు వెలిశాయి. తెలంగాణ గేట్స్ జీరో ఇన్ యూనియన్ బడ్జెట్ పేరుతో వెలిసిన ఫ్లెక్సీలు ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2023-24లో తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు చేయలేదు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన అనేక ప్రతిపాదనలను కేంద్రం పక్కన పెట్టింది. బడ్జెట్లో వాటి ప్రస్తావనే చేయలేదు. దేశంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రాధాన్యతను బట్టి బడ్జెట్లో కేటాయింపులు జరగలేదు. దీంతో గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్ర బడ్జెట్లో సాగునీటి రంగానికి చేసిన కేటాయింపుల్లో కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకే పెద్దపీట దక్కింది. తెలంగాణకు మొండిచెయ్యి చూపిందని కొందరు తెలంగాణ ప్రముఖులు మండిపడుతున్నారు.