పాతబస్తీలో దారుణం..
45 సంవత్సరాల మహిళ తలపై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్తో మోది హత్యచేసిన ఘటన...Latest News of Old City
దిశ, చార్మినార్: 45 సంవత్సరాల మహిళ తలపై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్తో మోది హత్యచేసిన ఘటన మంగళవారం తెల్లవారుజామున రెయిన్ బజార్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రెయిన్ బజార్ఇన్స్పెక్టర్ రంజిత్కుమార్గౌడ్తెలిపిన వివరాల ప్రకారం... మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో వెస్ట్ చంద్ర నగర్ లో గొడవ జరుగుతుందని ఫోన్రావడంతో రెయిన్బజార్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ అదే ప్రాంతానికి చెందిన పర్వీన్ సుల్తానా(45) మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది. పక్కనే మద్యం సీసాలు కూడా కనిపించడంతో గుర్తుతెలియని వ్యక్తులు మద్యం సేవించాక తలెత్తిన ఘర్షణలో గ్యాస్ సిలిండర్తో సదరు మహిళ తలపై మోదడంతో మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసును రెయిన్బజార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.