సనత్‌నగర్‌లో బీజేపీ జెండా ఎగరవేస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేస్తుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని...Kishan Reddy Padayatra in Ramgopalpet Devision

Update: 2022-12-06 13:23 GMT

దిశ, బేగంపేట: సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేస్తుందని, రానున్న ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జోష్యం చెప్పారు. మంగళవారం రాంగోపాల్ పేట డివిజన్ లో ఆయన పాదయాత్ర చేపట్టారు. పాదయాత్రలో మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్ రెడ్డి, మహంకాళి జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్, కార్పొరేటర్లు కొంతం దీపిక, కేతినేని సరళ తదితరులు కిషన్ రెడ్డి వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. డివిజన్ లో జీర హనుమాన్ దేవాలయం నుండి రాణిగంజ్ జీహెచ్ఎంసీ కమ్యూనిటీ హాల్, విక్టోరియా గంజ్, పాత బోయిగూడ, పాత గ్యాస్‌మండి మీదుగా మార్కెట్ డివిజన్ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. సంబంధిత అధికారులు పారదర్శకత వహించాలని సూచించారు. కార్యకర్తలు సమిష్టిగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు. సీనియర్ బీజేపీ నాయకులు చీర శ్రీకాంత్, ఎస్సార్ మల్లేష్, డివిజన్ అధ్యక్షులు ఆకుల ప్రతాప్, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Similar News