క్రికెట్ అభిమానులపై లాఠీచార్జ్ అమానుషం: అంజన్ కుమార్ యాదవ్

క్రికెట్ టికెట్ కోసం వచ్చి గాయాలు పాలై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలియా, శ్రీనాథ్ యాదవ్ (ఫైర్ జవాన్) లను మాజీ ఎంపీ అంజన్ కుమార్....Former MP Consoled Injured cricket fans

Update: 2022-09-22 16:56 GMT

దిశ, బేగంపేట: క్రికెట్ టికెట్ కోసం వచ్చి గాయాలు పాలై సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అలియా, శ్రీనాథ్ యాదవ్ (ఫైర్ జవాన్) లను మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్ తోపాటు కాంగ్రెస్ నాయకులు గురువారం రాత్రి పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. ప్రభుత్వం, పోలీసుల వైఫల్యమే కారణమని, ప్రభుత్వమే పూర్తి భాద్యత వహించి గాయపడ్డవారికి నష్టపరిహారం అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన వెంట సనత్ నగర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News