చేవెళ్ల ప్రజలంతా కొండా వెంటే : కొండా సంగీతా రెడ్డి

సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉంటారన్నారు ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి.

Update: 2024-04-27 09:46 GMT

దిశ, శేరిలింగంపల్లి : సార్వత్రిక ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ సెగ్మెంట్ లోని ప్రజలంతా బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి వెంటే ఉంటారన్నారు ఆయన సతీమణి కొండా సంగీతా రెడ్డి. శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని హోటల్ దస్ పల్లలో నిర్వహించిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ… కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిత్యం ప్రజలందరికీ అందుబాటులో ఉండే నాయకుడని అన్నారు.

చేవెళ్ల ప్రాంతంలోని ప్రజలంతా తమ తమ పార్టీలను పక్కనపెట్టి వ్యక్తిగతంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డికి మద్దతునిస్తున్నారని చెప్పారు. మే 13న జరగనున్న ఎన్నికల్లో అర్బన్ ప్రాంత ఓటర్లు భారీ సంఖ్యలో పాల్గొనాలని కొండా సంగీతా రెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలంతా తమ కోసం, తమ పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీని ఎన్నుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, మేధావులు, ఐటీ నిపుణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News