అందుబాటులో ఉండే వ్యక్తి రాగిడి లక్ష్మారెడ్డి

ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.

Update: 2024-05-09 11:33 GMT

దిశ, చైతన్యపురి : ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా గురువారం పార్టీ అభ్యర్థి రాగిడి లక్మారెడ్డికి మద్దతుగా కొత్తపేట డివిజన్ పరిధిలోని జైన్ మందిర్ నుండి మోహన్ నగర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కారు గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి సహకరించాలని కోరారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలు చేసి గద్దెనెక్కిన తరువాత ప్రజా సమస్యలు గాలికి వదిలేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సాగర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు లింగాల రాహుల్ గౌడ్, మహేష్ రెడ్డి, విజయ గౌడ్, ఉదయ్, రూప, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు. 


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News