ప్రతి ఒక్కరూ విశ్వాసంతో పని చేయాలి

రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ విశ్వాసంతో పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు.

Update: 2024-05-09 12:12 GMT

దిశ, సికింద్రాబాద్ : రాష్ట్రంలో రోజు రోజుకు బీజేపీ గ్రాఫ్ పెరుగుతుందని, ప్రతి ఒక్కరూ విశ్వాసంతో పనిచేయాలని సికింద్రాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం సికింద్రాబాద్ పరిధిలోని తార్నాక డివిజన్ లాలాపేట నుండి ప్రచార జీపు యాత్రను నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ సికింద్రాబాద్ పార్లమెంటు ప్రజలు తనను ఆశీర్వదించి మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ గెలుపు ఖాయమని, రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని పేర్కొన్నారు.

    గతంలో బలం లేని నియోజకవర్గంలో సైతం ప్రజల మద్దతు బీజేపీకి లభిస్తుందని చెప్పారు. మోడీ అభివృద్ధికి ప్రజలు మరోసారి పట్టం కట్టనున్నారని పేర్కొన్నారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న మోడీ సభకు కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని సూచించారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించనున్నారని, ప్రతి ఒక్కరూ హాజరై వినాలన్నారు. నగరంలోని ప్రతి గల్లీ నుండి ప్రజలు పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంకు తరలిరావాలని, మోడీని మరోసారి ఆశీర్వదించి బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. 

Similar News