CM రేవంత్ రెడ్డితో మాజీ RBI గవర్నర్ రఘురాం రాజన్ భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ భేటీ అయ్యారు.

Update: 2023-12-17 05:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆదివారం భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో సమావేశం అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చుకునేందుకు సీఎంకు ఆర్బీఐ మాజీ గవర్నర్ పలు సూచనలు చేశారు. సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి, సీఎం కార్యదర్శి పాల్గొన్నారు.


CM రేవంత్ రెడ్డికి మాజీ డీఎస్పీ నళిని సంచలన లేఖ 

Tags:    

Similar News