రాజాసింగ్ పీడీ యాక్ట్పై ముగిసిన విచారణ.. వివరించిన పోలీసులు..
దిశ, వెబ్డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఇటీవల పీడీయాక్ట్ నమోదైంది. ఈ పీడీయాక్ట్పై అడ్వైజరీ బోర్డు విచారణ గురువారం..
దిశ, వెబ్డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై ఇటీవల పీడీయాక్ట్ నమోదైంది. ఈ పీడీయాక్ట్పై అడ్వైజరీ బోర్డు విచారణ గురువారంతో ముగిసింది. ఈ విచారణ బోర్డ్ చైర్మన్ బాస్కర్ రావు, ఇద్దరు రిటైర్డ్ జడ్జిల సమక్షంలో జరిగింది. ఇందులో రాజాసింగ్ చర్లపల్లి జైటు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ విచారణకు వెస్ట్ జోన్ డీసీపీ, మంగళ్హాట్, షాహినాయత్ గంట్ జోలీసులు హాజరయ్యారు. పోలీసులతో పాటు రాజాసింగ్ కుటుంబ సభ్యులు కూడా విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా పీడీయాక్ట్పై రాజాసింగ్ అభ్యంతరాలను బోర్డు తెలుసుకుంది. అనంతరం రాజాసింగ్పై పీడీయాక్ట్ పెట్టేందుకు దారితీసిన పరిస్థితలను పోలీసులు బోర్డును వివరించారు. దాదాపు గంట పాటు ఈ విచారణ కొనసాగింది. ఇందులో తనపై పీడీయాక్ట్ నమోదుపై రాజాసింగ్ పలు అభ్యంతరాలను తెలిపినట్లు తెలుస్తోంది.