Tirumala Samacharam: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే?

కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది.

Update: 2024-05-06 17:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిథి తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం శ్రీవారిని దర్శనానికి ఓ మోస్తారుగా జనం తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తులకు దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం పడుతోంది. అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగియడంతో తిరుమల క్షేత్రానికి భక్తుల రద్దీ రానున్న రోజుల్లో విపరీతంగా పెరిగిందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి సుమారు 3 గంటల సమయం పడుతోంది. సోమవారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. శనివారం స్వామి వారిని 81,957 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 29,126 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.28 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు వెల్లడించారు.

Read More..

BREAKING: ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తా  

Tags:    

Similar News