లోక్‌సభలో మరో 50 మంది ఎంపీలు సస్పెండ్.. బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ కీలక పిలుపు

పార్లమెంట్‌లో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఎంపీల సస్పెన్షన్‌తో ఉభయ సభలు సజావుగా నడవలేని పరిస్థితి నెలకొంది.

Update: 2023-12-19 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది. ఎంపీల సస్పెన్షన్‌తో ఉభయ సభలు సజావుగా నడవలేని పరిస్థితి నెలకొంది. ఈ సెషల్‌లో మొత్తం 142 మంది ఎంపీలపై చైర్మన్ సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు కీలక మెసేజ్ పంపించారు. ఎంపీలంతా ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని ఆదేశించారు.

కాగా, లోక్‌సభలో మొత్తం 96 మంది ఎంపీలు, రాజ్యసభలో 46 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. తాజాగా.. ఇవాళ మరో 50 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అయితే, ఇవాళ సభలు ప్రారంభం కాగానే సస్పెన్షన్‌లను నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలంతా నిరసన వ్యక్తం చేశారు. చైర్మన్ ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో 50 మంది సభ్యులను సస్పెండ్ చేశారు. దీంతో సభలో మళ్లీ గందరగోళ వాతావరణం చోటుచేసుకుంది.

Tags:    

Similar News