విమానాశ్రయ మెట్రోకు శ్రీకారం.. నేడు శంకుస్థాపన చేయనున్న CM KCR
టీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో రెండో దశ విస్తరణకు ఇవాళ(శుక్రవారం) సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
దిశ, వెబ్డెస్క్: టీఆర్ఎస్ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మెట్రో రెండో దశ విస్తరణకు ఇవాళ(శుక్రవారం) సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. రాయదుర్గం రహేజా మైండ్ స్పేస్ జంక్షన్ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు చేపడుతున్న పనులకు భూమి పూజ చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అప్పా కూడలిలోని పోలీసు అకాడమీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. విమానాశ్రయం వరకు విస్తరించే ఈ మెట్రోలో ఇప్పుడున్న దానికంటే అధునాతన సౌకర్యాలు కల్పించనున్నారు. ఎక్కువమంది కూర్చునేలా సీట్లు ఉండనున్నాయి. దీనికోసం దాదాపు రూ.6250 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయనుంది. మొత్తం 31 కిలోమీటర్ల దూరం కొనసాగనుంది.
Also Read....