Minister Puvvada Ajay కి సీఎం కేసీఆర్ ఫోన్

మంత్రి పువ్వాడ అజయ్‌కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు.

Update: 2023-01-19 03:41 GMT

దిశ, వెబ్ డెస్క్: మంత్రి పువ్వాడ అజయ్‌కి సీఎం కేసీఆర్ ఫోన్ చేశారు. ఖమ్మంలో నిన్న జరిగిన బీఆర్ ఎస్ ఆవిర్భావ సభకు జనం పెద్ద ఎత్తున రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. శభాష్ అజయ్ అని మెచ్చుకున్నారు. ఖమ్మం చరిత్రలో ఇంత పెద్ద సభ ఎప్పుడూ జరగతేదని తెలిపారు. ఇతర స్టేట్‌ల సీఎం‌లు సైతం జనాన్ని చూసి ఆశ్చర్యపోయారని గుర్తుచేశారు.

అయితే సభా వేదికపైనే పువ్వాడ అజయ్‌ని సీఎం కేసీఆర్ అభినందించగా సభ ముగిసిన తర్వాత కూడా సీఎం స్పెషల్‌గా ఫోన్ చేసి అభినందించారు. హెలికాప్టర్‌లో వస్తుండగా ఇతర రాష్ట్రాల సీఎంలు సభకు వస్తున్న జనాన్ని చూసి ఇంత జనమా అంటూ ఆశ్చర్యపోయారన్నారు.

Also Read....

బీఆర్ఎస్ పాలసీ టూ లేట్... అప్పుడే వరాల జల్లు..? 

సీఎం కేసీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Tags:    

Similar News