రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. ఉరేసుకుని వ్యక్తి అనుమానాస్పద మృతి

చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి అనుమానాస్పదన స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కోటపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది.

Update: 2024-04-28 06:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: చెట్టుకు ఉరేసుకుని ఓ వ్యక్తి అనుమానాస్పదన స్థితిలో మృతిచెందిన ఘటన రంగారెడ్డి జిల్లా కోటపల్లి మండల పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బార్వాద్ గ్రామానికి చెందిన పెద్దోట్ల నర్సింహులు (46) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు శనివారం రాత్రి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న చెట్టుకు ఉరేసుకున్నాడు. అయితే, ఉదయం మృతదేహాన్ని గమనించిన స్థానికులు, గ్రామస్తులు డయల్ 100‌ ద్వారా కోటపల్లి పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాం ఉన్న ప్రాంతాన్ని పరిశీంచారు. డాగ్ స్క్వాడ్ ద్వారా మరోసారి తనిఖీలు చేపట్టున్నట్లు ఎస్సై స్రవంతి తెలిపారు. మృతుడు నర్సింహులుకు పాప, బాబు ఉన్నారు. రెండేళ్లుగా భార్య అతడికి దూరంగా ఉంటున్నట్లుగా తెతుస్తోంది. 

Similar News