BREAKING: భక్తులతో పోటెత్తిన యాదాద్రి పుణ్యక్షేత్రం.. కిక్కిరిసిన దర్శన క్యూ లైన్లు

తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తుల రాకతో కలకలలాడుతోంది.

Update: 2024-04-28 07:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తుల రాకతో కలకలలాడుతోంది. ఆదివారం సెలవు దినం కావడం, పిల్లలకు పరీక్షలు ముగియడంతో స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. స్వామి వారి ఉచిత దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. ఇక ప్రత్యేక దర్శనం విషయానికి వస్తే.. సుమారు 2 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దర్శన క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. పులిహోర, లడ్డూ ప్రసాద క్యూ లైన్లలో భక్తులు కీటకటలాడుతున్నారు.  

Tags:    

Similar News