BREAKING: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం.. హైదరాబాద్‌ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా

ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది.

Update: 2024-04-25 14:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ ఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రాను ఎన్నికల సంఘం నియమించింది. ఈ మేరకు ఇవాళ అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. అయితే, అదే స్థానంలో విధులు నిర్వర్తించిన డీసీపీ సాయిచైతన్యను బదీలీ చేసి డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ముగ్గురి పేర్లను సీఎస్‌ శాంతి‌కుమారి ఈసీకి పంపింది. మొత్తం ముగ్గురు పేర్లను పరిశీలించిన ఈసీ చివరకు స్నేహ మెహ్రాను హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని, ఇచ్చిన బాధ్యతలను వెంటనే స్వీకరించాలని ఈసీ ఆదేశించింది. 




Tags:    

Similar News