BREAKING: పాలన కోసం.. పదవుల కోసం పాకులాడేది బీజేపీనే: ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

పాలన కోసం.. పదవుల కోసం పాకులాడేది బీజేపీ నేతలేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.

Update: 2024-02-27 08:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: పాలన కోసం.. పదవుల కోసం పాకులాడేది బీజేపీ నేతలేనని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్‌పై ఎంపీ బండి సంజయ్ చేసిన కామెంట్స్‌కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం సరికాదని అన్నారు. పాలనలో శ్రీరాముడిని అనుకరించాలి గానీ, విద్వేషపూరిత రాజకీయాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. తాము అధికారంలోకి రాగానే విదేశాల నుంచి నల్లధనం తీసుకొస్తామని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. పదేళ్ల బీజేపీ పాలనలో దేశంలో ఎక్కడ వెలగట్లేదని.. కేవలం కార్పొరేట్ల ఇళ్లు మాత్రమే వెలుగుతున్నాయని ఆయన ఎద్దేవా చేశారు. తమ స్వార్థం కోసం మహిళలను కించపరిచేలా బీజేపీ నాయకులు మాట్లాడటం బాధకరమని అన్నారు.   

Tags:    

Similar News