BREAKING: శ్రీశైలం వెళ్తున్న భక్తులకు బిగ్ అలర్ట్.. ఆ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల నిలిపివేత

మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న భక్తులు పోలీసు శాఖ వారు కీలక విజ్ఞప్తి చేశారు.

Update: 2024-03-08 12:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీశైలం వెళ్తున్న భక్తులు పోలీసు శాఖ వారు కీలక విజ్ఞప్తి చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా మన్ననూరు చెక్‌పోస్ట్ వద్ద వాహనాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ రాత్రి 9 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటలకు వరకు వాహనాలను పూర్తిగా నిలిపివేయనున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. యాత్రికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని కోరారు.

Tags:    

Similar News