దిశ కంటే దారుణమైన ఘటన ఇది: బండి సంజయ్

పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. దారణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పన్నపేట గ్రామంలోని ఓ వెంచర్‌లో ఈ సంఘటన జరిగింది.

Update: 2023-08-19 10:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: పెద్దపల్లి జిల్లాలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ చేసి.. దారణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అప్పన్నపేట గ్రామంలోని ఓ వెంచర్‌లో ఈ సంఘటన జరిగింది. తాజాగా.. ఈ ఘటనపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు కరీంనగర్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. పెద్దపల్లిలో బాలిక హత్య కేసును నీరు గార్చేశారని పోలీసులపై మండిపడ్డారు. హత్య, అత్యాచారాలతో బాధితులను ప్రలోభపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలిక మరణాన్ని ఆత్మహత్యగా తేల్చేశారని సీరియస్ అయ్యారు. దిశ కంటే దారుణమైన ఘటన ఇది అని అభివర్ణించారు. స్థానిక బీఆర్ఎస్ మంత్రే ఈ కేసును మూసేసే ప్రయత్నం చేస్తున్నాడని విమర్శించారు. ఈ కేసుపై సీఎంవో నుంచి స్థానిక పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. 

Tags:    

Similar News