సైకిల్‌పై హిందూ ఏక్తా యాత్రకు.. కార్యకర్తను సన్మానించిన బండి సంజయ్

హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా చర్లపల్లి నుంచి సైకిల్ తొక్కుతూ కరీంనగర్ కు చేరుకున్న కటకం శ్రీధర్ అనే కార్యకర్తను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు.

Update: 2023-05-16 15:57 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : హిందూ ఏక్తా యాత్రలో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా చర్లపల్లి నుంచి సైకిల్ తొక్కుతూ కరీంనగర్ కు చేరుకున్న కటకం శ్రీధర్ అనే కార్యకర్తను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సన్మానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ ని శ్రీధర్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా నడి ఎండలో అంత దూరం సైకిల్ తొక్కుకుంటూ రావడంపై బండి ఆశ్చర్యం వ్యక్తంచేశారు. హిందుత్వం కోసం కష్టపడుతున్నావంటూ శాలువా కప్పి అభినందించారు.

Tags:    

Similar News