నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకొని కాంగ్రెస్‌కు ప్రచారం చేస్తా.. బండి సంజయ్ సంచలన సవాల్

కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ చేశారు. ఆరు గ్యారంటీల్లో మహిళలకు రూ.2500, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, విద్యార్థి భరోసా ఇచ్చామని నిరూపించండి అని ఛాలెంజ్ చేశారు.

Update: 2024-04-27 06:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ సవాల్ చేశారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో మహిళలకు రూ.2500, ఆసరా పెన్షన్ రూ.4 వేలు, విద్యార్థి భరోసా ఇచ్చామని నిరూపించండి అని ఛాలెంజ్ చేశారు. నిరూపిస్తే తాను పార్లమెంట్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అంతేకాదు.. నిరూపిస్తే కాంగ్రెస్ తరపున పార్లమెంట్ ఎన్నికల్లో స్వయంగా నేనే ప్రచారం చేస్తా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. నిరూపించకపోతే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు.

నా సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్‌లో ఏ నాయకుడికైనా ఉందా? అని అడిగారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలే నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. అసలు దేశాన్ని నడిపించే నాయకుడు, ప్రధాని అయ్యే క్వాలిటీస్ ఉన్నా అభ్యర్థి కాంగ్రెస్‌లో ఉన్నారా? అని ప్రశ్నించారు. కనీసం పీఎం అభ్యర్థి ఎవరో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. కరీంనగర్‌లో తనకు ఎవరూ పోటీ కాదని అన్నారు. ఆ రెండు పార్టీలు రెండో స్థానం కోసం పోటీ పడబోతున్నాయని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కొన్నిచోట్ల బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని సెటైర్లు వేశారు.

Tags:    

Similar News