పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు బెజ్జూర్ ఎస్సై వెంకటేష్ తెలిపారు.

Update: 2023-05-27 09:01 GMT

దిశ, బెజ్జుర్ : పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు బెజ్జూర్ ఎస్సై వెంకటేష్ తెలిపారు. బెజ్జూరు మండలం చిన్న సిద్దాపూర్ గ్రామానికి చెందిన టాకిర్ నారాయణ (50) అనే వ్యక్తి శనివారం తెల్లవారుజామున పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని భార్య సంతర్ బాయ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతునికి భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Similar News