సందేహాలు, ఫిర్యాదులకు సంప్రదించండి : ఎన్నికల వ్యయ పరిశీలకులు

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే తమను సంప్రదించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Update: 2024-04-29 12:35 GMT

దిశ, ఆదిలాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు, అభ్యర్థులు తమ ఎన్నికల ఖర్చుల నిమిత్తం ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే తమను సంప్రదించాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు జాదావార్ వివేకానంద ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి ఏమైనా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి, ఫిర్యాదులు ఇవ్వడానికి సెల్ నెం.8143876383 కు సంప్రదించవచ్చని,లేదా నేరుగా సంప్రదించాలనుకునేవారు జిల్లా కేంద్రంలోని పెనుగంగా విశ్రాంతి భవనంలో ఉదయం 9.00 గంటలు నుండి 10.00 గంటల వరకు సంప్రదించవచ్చని పరిశీలకులు తెలిపారు.

Similar News