పటిష్ట భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలు
లోక్సభ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు.
దిశ, మంచిర్యాల : లోక్సభ ఎన్నికలు పూర్తైన నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్ లలో ఈవీఎంల రక్షణ కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లాలోని హాజీపూర్ మండలం ముల్కల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రతా ఏర్పాట్లు, కంట్రోల్ రూమ్ లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ముగిసిందని, జూన్ 4వ తేదీన కౌంటింగ్ కార్యక్రమం ఉంటుందన్నారు. 6వ తేదీ వరకు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను ఏర్పాటు చేసి పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి గంగారం, హాజీపూర్ తహసీల్దార్ పి. సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.