అక్రమాలకు పాల్పడిన పోలీసులపై కొరడా...

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దసరా వసూళ్లకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.

Update: 2022-10-04 11:35 GMT

దిశ, బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో దసరా వసూళ్లకు పాల్పడిన ఇద్దరు కానిస్టేబుల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఉద్యోగ ధర్మాన్ని విస్మరించిన సదరు కానిస్టేబుళ్లు అక్రమ వసూళ్లకు దిగిన విషయం రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి వెళ్ళింది.

బెల్లంపల్లి వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ ముష్కరాజు సర్కిల్ లో పనిచేస్తున్న కొమ్మిరెడ్డి సురేష్, ఒద్ది విద్యాసాగర్ అక్రమ వసూళ్లకు పాల్పడిన కారణంతో వారిపై వేటు పడింది. ఈ మేరకు సురేష్, విద్యాసాగర్ ను రామగుండం కమిషనర్ కు అటాచ్డ్ చేశారు. వారిపై విచారణకు ఆదేశాలు జారైనట్లు సమాచారం.

Tags:    

Similar News