ప్రమాదవశాత్తు చెట్టు పైనుంచి పడి వ్యక్తి మృతి

ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భీమిని మండలం కేసులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2023-04-18 14:08 GMT

దిశ, భీమిని: ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి పడి మంగళవారం ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన భీమిని మండలం కేసులాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మాడే శంకర్ (49) చింతకాయలు తెంపేందుకు చెట్టు ఎక్కి కాలుజారి ప్రమాదవశాత్తు చెట్టు కింద ఉన్న ట్రాక్టర్ పై పడిపోయాడు. దీంతో శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం బెల్లంపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. 

Tags:    

Similar News