ప్రశాంత ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు సహకరించాలి

ప్రశాంత ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు.

Update: 2024-05-07 13:29 GMT

దిశ, ఆసిఫాబాద్ : ప్రశాంత ఎన్నికల కోసం అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆర్డీఓ లోకేశ్వర్ రావు తో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు రెండు అసెంబ్లీ సెగ్మెంట్ ల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ సజావుగా సాగేందుకు రాజకీయ పార్టీల అభ్యర్థులు సహకరించాలని కోరారు. వయోవృద్ధులు, దివ్యాంగులకు హోం ఓటింగ్ 157 మంది దరఖాస్తు చేసుకోగా 151 మంది ఓటు హక్కువినియోగించుకోగా, 1934 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. 

Similar News