కొత్త మండలంగా మాసాయిపేట

దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీఓ విడుదలైంది. మాసాయిపేటను కొత్త మండలంగా ప్రకటిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు, చేగుంట మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మాసాయిపేటను మండలంగా ప్రకటించారు. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి పల్లిలతో మండలం ఏర్పడింది.

Update: 2020-07-01 05:47 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని నెరవేరుస్తూ జీఓ విడుదలైంది. మాసాయిపేటను కొత్త మండలంగా ప్రకటిస్తూ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెదక్ జిల్లా తూప్రాన్ రెవెన్యూ డివిజన్‌లో ఈ మండలం ఏర్పడింది. ఎల్దుర్తి మండలంలోని ఆరు గ్రామాలు, చేగుంట మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మాసాయిపేటను మండలంగా ప్రకటించారు. చెట్లతిమ్మాయిపల్లి, పోతంపల్లి, పోతంశెట్టిపల్లి, మాసాయిపేట, రామాంతాపూర్, అచంపేట, హకీంపేట, కొప్పులపల్లి, లింగారెడ్డి పల్లిలతో మండలం ఏర్పడింది.

Tags:    

Similar News