ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ప్రధాని మోడీకి భయం: అద్దంకి దయాకర్

బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే మోడీ దేశం

Update: 2024-04-30 13:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కోసమే మోడీ దేశం మొత్తం తిరుగుతున్నారని, కానీ మణిపూర్‌ రాష్ట్రానికి పోవాలంటే ప్రధానికి భయమని అన్నారు. బీజేపీ హయాంలో చట్ట సభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించలేదని, దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ నాశనమైందని మండిపడ్డారు. మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, మణిపూర్‌లో లోకల్ రిజర్వేషన్ల విషయంలో మైతేయి, కుకీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. మణిపూర్ అల్లర్లలో చాలా మంది పౌరులు మృతి చెందారు. మణిపూర్ అల్లర్లతో అట్టుడికిపోతుంటే మోడీ విదేశీ పర్యటనలకు వెళ్తారు కానీ.. ఆ రాష్ట్రానికి వెళ్లరని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Read More...

ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా గురుకుల పాఠశాలల విజయం: మంత్రి పొన్నం 

Tags:    

Similar News