రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ: సీఎం కేసీఆర్

దిశ, తెలంగాణ బ్యూరో: రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్ర వ్యవసాయం రూపుదిద్దుకోవడం సంతోషకరమైన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (జూన్ 7) సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను […]

Update: 2021-06-07 07:46 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా రాష్ట్ర వ్యవసాయం రూపుదిద్దుకోవడం సంతోషకరమైన విషయమని సీఎం కేసీఆర్ అన్నారు. సోమవారం ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం (జూన్ 7) సందర్భంగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఆహారం కోసం అలమటించిన తెలంగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారడం వెనక రాష్ట్ర ప్రభుత్వ కృషిని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనతికాలంలో రెండు పంటలకు రెండుకోట్ల ఎకరాల మాగాణాగా తెలంగాణను తీర్చిదిద్దుకున్నామని తెలిపారు. దాదాపు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం ఉత్పత్తితో, దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలోకి ఎదుగుతున్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం, ఆహార భద్రతను దాటి దేశానికి ఆహార భరోసాను కల్పించే స్థితికి చేరుకున్నదన్నారు.

రాష్ట్రంలో తిండికి లోటు ఉండకూడదనే లక్ష్యంతో, ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా, ఒక వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి కిలో రూపాయి చొప్పున ఆహార భద్రతా కార్డు (రేషన్ కార్డు) ద్వారా నాణ్యమైన బియ్యాన్ని ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రేషన్ కార్డు కలిగిన మొత్తం 87,41,000 కుటుంబాల్లోని 2,79,27,000 (రాష్ట్ర జనాభాలో 72శాతం) మందికి కేవలం రూ.1 కిలో చొప్పున 20 లక్షల మెట్రిక్ బియ్యాన్ని పంపిణీ చేస్తున్నదని సీఎం తెలిపారు. రాష్ట్రం వ్యాప్తంగా విద్యార్థులకు సన్నబియ్యాన్ని అందిస్తూ ఆహార భద్రతను ప్రభుత్వం కల్పిస్తున్నదని వివరించారు. రేషన్ కార్డుదారులు ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం రేషన్ పోర్టబిలిటీ రూపొందించిందన్నారు. తద్వారా తెలంగాణ పౌరులు రాష్ట్రంలో ఎక్కడున్నా ఆహార భద్రత లభించే ఏర్పాటును ప్రభుత్వం చేసిందన్నారు.

Tags:    

Similar News