ఎలక్షన్ కమిషనర్ చీట్ చేశారు : బండి సంజయ్

దిశ, వెబ్‌డెస్క్ : అర్థరాత్రి వేళ సర్క్యులర్ తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి చీటింగ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ పోలింగ్ ముగిశాక అర్థరాత్రి వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించలేదన్నారు. ఎన్నికల రోజు లేట్ నైట్ వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి రహస్యంగా భేటి అయ్యారని, ఆ తర్వాతే పోలింగ్ శాతాన్ని ప్రకటించారని ఆరోపించారు. ఎన్నికల సంఘం జారీ చేసిన […]

Update: 2020-12-03 20:36 GMT

దిశ, వెబ్‌డెస్క్ : అర్థరాత్రి వేళ సర్క్యులర్ తీసుకొచ్చి తెలంగాణ ఎన్నికల కమిషనర్ పార్థసారధి చీటింగ్ చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ పోలింగ్ ముగిశాక అర్థరాత్రి వరకు పోలింగ్ శాతాన్ని అధికారులు ప్రకటించలేదన్నారు. ఎన్నికల రోజు లేట్ నైట్ వరకు జీహెచ్ఎంసీ కార్యాలయంలో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి రహస్యంగా భేటి అయ్యారని, ఆ తర్వాతే పోలింగ్ శాతాన్ని ప్రకటించారని ఆరోపించారు.

ఎన్నికల సంఘం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదని, కోర్టు ద్వారా కౌంటింగ్‌ను ఆపే ప్రయత్నం చేస్తామని ఆయన వెల్లడించారు.

Tags:    

Similar News