క్వార్టర్స్‌కు దూసుకెళ్లిన శరత్ కమల్

సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.

Update: 2024-03-14 14:13 GMT

దిశ, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గురువారం జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో శరత్ 3-0(11-4, 11-8, 12-10) తేడాతో వరల్డ్ నం.22 ఆటగాడు, ఈజిప్ట్‌కు చెందిన ఒమర్ అస్సర్‌ను చిత్తు చేశాడు. శరత్ తనకంటే మెరుగైన ర్యాంక్ కలిగిన ఆటగాడిపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరుసగా మూడు గేమ్‌లను గెలుచుకుని క్వార్టర్స్‌కు చేరుకున్నాడు. దీంతో వరల్డ్ టేబుల్ టెన్నిస్(డబ్ల్యూటీటీ) స్మాష్ ఈవెంట్‌లో మెన్స్ సింగిల్స్ కేటగిరీలో క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత ఆటగాడిగా శరత్ నిలిచాడు. క్వార్టర్స్‌లో వరల్డ్ నం.6 ర్యాంకర్, ఫ్రాన్స్ ఆటగాడు ఫెలిక్స్ లెబ్రాన్‌తో తలపడనున్నాడు. 

Tags:    

Similar News