ఐదో టీ20లో కివీస్పై పాక్ గెలుపు.. టీ20 సిరీస్ డ్రా
ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ డ్రాగా ముగిసింది.
దిశ, స్పోర్ట్స్ : ఆతిథ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ20ల సిరీస్ డ్రాగా ముగిసింది. ఆఖరిదైన ఐదో టీ20లో పాక్ నెగ్గి సిరీస్ను 2-2తో సమయం చేయడంతో ఇరు జట్లు ట్రోఫీని పంచుకున్నాయి. శనివారం జరిగిన చివరి టీ20 మ్యాచ్లో పాకిస్తాన్ 9 వికెట్ల తేడాతో కివీస్ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత ఓవర్లలో 178/5 స్కోరు చేసింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(69) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఫకర్ జమాన్(43), ఉస్మాన్ ఖాన్(31) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో కివీస్ 19.2 ఓవర్లలో169 పరుగులకే ఆలౌటైంది. 4 వికెట్లు తీసిన షాహీన్ అఫ్రిది తన పేస్తో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు. టిమ్ సీఫెర్ట్(52) హాఫ్ సెంచరీతో రాణించగా.. జోష్ క్లార్క్సన్(38 నాటౌట్) చేసిన పోరాటం ఫలించలేదు.