లక్నో జట్టు ఓనర్లపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం

బుధవారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ జట్టు భారీ విజయం అందుకుంది.

Update: 2024-05-09 05:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుధవారం ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్ సన్ రైజర్స్ జట్టు భారీ విజయం అందుకుంది. అయితే 162 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ ఓపెనర్లు శర్మ, హెడ్ కేవలం 9.4 ఓవర్లలోనే చేధించారు. ఈ మ్యాచ్ లో ఘోర ఓటమి తర్వాత కెప్టెన్ కేఎస్ రాహుల్ తో.. లక్నో జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా ప్రవర్తించిన తీరు.. క్రికెట్ అభిమానులకు ఆగ్రహం వ్యక్తం చేసింది. మ్యాచ్ ఓటమి తర్వాత సీదా గ్రౌండ్ లోకి వచ్చిన లక్నో యాజమాన్యం రాహుల్ ను బహిరంగంగా తిట్టడం కనిపించింది. దీంతో భారత జట్టులో సీనియర్ ఆటగాడిని ఇలా కించపరచడం ఎంటని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. షేమ్ ఆన్ సంజీవ్ గోయెంకా, షేమ్ ఆన్ లక్నో యాజమాన్యం ట్యాగ్ లైన్ తో సోషల్ మీడియాలో ట్వీట్లు పెడుతున్నారు.

Similar News