దులీప్ ట్రోఫీ 2022 విజేతగా వెస్ట్‌జోన్..

దులీప్ ట్రోఫీ 2022 విజేతగా అజింక్యా రహానే సారథ్యంలోని వెస్ట్‌జోన్ జట్టు - Duleep Trophy: West Zone crush South by 294 runs to win title

Update: 2022-09-25 10:33 GMT

దిశ, వెబ్‌డెస్క్: దులీప్ ట్రోఫీ 2022 విజేతగా అజింక్యా రహానే సారథ్యంలోని వెస్ట్‌జోన్ జట్టు నిలిచింది. కోయంబత్తూరులోని ఎస్‌ఎన్‌ఆర్‌ కాలేజీ క్రికెట్‌ మైదానంలో జరిగిన టైటిల్ పోరులో వెస్ట్ జోన్ 294 పరుగుల తేడాతో సౌత్ జోన్‌ను చిత్తు చేసింది. 529 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్‌జోన్‌ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే అలౌట్ అయింది. ఐదో రోజు ఆటలో సౌత్‌జోన్ మరో 80 పరుగులు మాత్రమే చేసి.. మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. సౌత్‌జోన్ బ్యాటింగ్‌లో రోహన్ కన్నుమ్మల్ 93 రన్స్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన రవితేజ 8 వ స్థానంలో బ్యాటింగ్‌ వచ్చి.. 53 రన్స్‌తో ఆకట్టుకున్నాడు.

వెస్ట్‌జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లకు 585 రన్స్ వద్ద డిక్లెర్ చేసింది. యశస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో (265; 30 ఫోర్స్, 4 సిక్స్‌లు) వెస్ట్‌జోన్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. యశస్వి జైస్వాల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. జైదేవ్ ఉనాద్కార్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

Similar News